Nagarkurnool
- Nov 23, 2020 , 02:47:57
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన

నాగర్కర్నూల్ టౌన్: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో కార్తీకమాస వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక దీపారాధన, ఆకాశ దీపోత్సవం, ప్రత్యేక పూజలను భక్తులు భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. రామాలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు కార్తీకమాసం విశిష్టతను వివరించారు. ఈమాసంలో భక్తులు దీపారాధన, ఆకాశ దీపోత్సవం, దీపదానం, సాలగ్రామ దానం, వస్త్రదానం, అన్నదానం, భూదానం, గోదానం, వంటివి విరివిగా చేస్తుంటారన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పుణ్యం లభిస్తుందన్నారు. ప్రాతఃకాలంలోనే పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు, సీతారామచంద్రస్వామికి కుంకుమార్చనలు, సాయంత్రం వేళలో ఆకాశదీపం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్కు టీకాలు.. భారత్ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
MOST READ
TRENDING