తిరుపతి : తిరుపతి రూరల్ మండలం తాటితోపు సమీపంలోని వెంకటపతి నగర్లో విషాదం నెలకొంది. ఓ 42 ఏండ్ల వ్యక్తి తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ఆధార్ కార్డు ఆధారంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.