ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలికొవిడ్ కట్టడికి మూడంచెల వైద్యవిధానం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన సినీనటి సమంత
నారాయణపేట, మే 19 : జిల్లాలో కరోనా నియంత్రణకు అవసరమైన మందులతోపాటు అన్ని సౌకర్యాలు ఉ న్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం పేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డితో కలిసి కొవిడ్ నియంత్రణ, ధాన్యం కొనుగోలు పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లు అందజేయాలని ఆదేశించారు. లక్షణాలు తీ వ్రంగా ఉన్న వారికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు, రెమ్డెసివిర్ మందులు అందుబాటులో ఉన్నాయని, కావున ప్రజలు మనోధైర్యంతో ఉండాలన్నారు.
అవసరమైన మేరకు కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలను ఏ ర్పాటు చేసుకోవాలని, జిల్లాలోని పాజిటివ్ కేసులను పీ హెచ్సీల వారీగా విభజన చేసుకొని మధ్యాహ్నం తర్వాత వైద్యులు గ్రామాల్లో కొవిడ్ బాధితుల పరిశీలనకు వెళ్లాలని ఆదేశించారు. పరిశీలనకు వెళ్లే ముందు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని, ప్రతి రోజూ ఎంత మందిని కలిశారనే విషయాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఎవరెవరికి లక్షణాలు ఉన్నాయి..? వై ద్యం వివరాలు, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారమంతా పంచాయతీ సెక్రటరీ, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, పీహెచ్సీ వైద్యుల వద్ద ఉండాలని సూచించారు.దిగుబడి మేరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
వ్యవసాయ, మార్కెటింగ్ గోదాంలను ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. కొత్తగా రైస్ మిల్లులు పెట్టేందుకు ముందుకు వ చ్చే వారిని ప్రోత్సహించాలన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ మందుల ను అందుబాటులో ఉంచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ సైతం రా ష్ట్రంలో అమలు చేసేందుకు విధివిధానాలు ఖరారు చేయ డం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రె డ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా చికిత్సలు చేసుకునేందుకు అవసరం మేరకు ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బంది, వ్యాక్సి న్, మందులను కేటాయించాలని మంత్రిని కోరారు. ధా న్యం దిగుబడి అధికంగా ఉన్నందున రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, లారీలు, హమాలీల సమస్యలు లేకుండా చూడాలన్నారు. గన్నీ బ్యాగులు, గోదాంల సమస్య ఉందని డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఎస్పీ చేతన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.శైలజ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్సుధాకర్, డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు..
మక్తల్ టౌన్, మే 19 : కొవిడ్ రోగులకు ప్రభుత్వ ద వాఖానల్లో అన్ని వసతులు ఉన్నాయని, వైద్యాధికారులు మూడంచెల వైద్యం ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం మక్తల్ పట్టణంలోని ప్ర భుత్వ దవాఖానలో పది పడకల కొవిడ్ సర్వీస్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారి ఇంట్లో వేరు గదులు లేకుంటే వారికి కావాలసిన ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అక్కడే మం దులు, ఆహారం ఇస్తూ చికిత్సలు చేయాలని, పరిస్థితి విషమిస్తే అంబులెన్స్ ద్వారా ఆక్సిజన్ బెడ్లు ఉన్న కొవిడ్ కేర్ సెంటర్కు తరలించాలన్నారు. మక్తల్లోని కొవిడ్ సెంటర్లో ఐదు ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు, మరో ఐదు ఆ క్సిజన్ కాన్సంట్రేటర్లు కలిగి ఉన్నాయని తెలిపారు. బాధితుల వెంట వచ్చే వారికి వసతి, భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి, ఎస్పీ చేతన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఇన్చార్జి డీఎంహెచ్వో శైలజ, డీఎస్పీ మధుసూదన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సినీ యాక్టర్ సమంత 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వ కృషికి ప్రైవేట్ సం స్థల తోడ్పాటు ఎంతో అవసరమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యం లో సినీ యాక్టర్ సమంత మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, ఎంఎస్ఎం ల్యా బొరేటరీ ద్వారా రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా వాటిని మంత్రి బుధవారం దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బందికి అప్పగించారు. ఆక్సిజన్ కొరత వల్ల జనరల్ దవాఖానలో ఇంకా ఆవసరమైనన్ని బెడ్లు ఏర్పాటు చేయలేకపోతున్నామని, వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. ఆక్సిజన్ కా న్సంట్రేటర్లు అత్యవసర సమయాల్లో కొవిడ్ రోగులకు ఉ పయోగపడుతాయని వీటిని దేవరకద్ర, రాజపూర్, సీసీకుంట, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో భార్యా, బిడ్డలను వదిలి 24 గంటలు పనిచేస్తు న్న డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బందిని మంత్రి కొనియాడారు. అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కొవిడ్ వార్డులకు వెళ్లి పరిస్థితిని సమీక్షిసున్నారని, పేషంట్లలో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, వైద్యులు నవాల్ కిశోర్, జీవన్, నరసింహరా జు, కిరణ్, రాధ, పద్మ, లక్ష్మీపద్మప్రియ, మున్సిపల్ చైర్మ న్ కేసీ నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్ తదితరులున్నారు.