ముంబై: వీధి కుక్కను చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. బంగూర్ నగర్లో నివాసం ఉండే 31 ఏండ్ల ఇమ్రాన్ షా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బైక్ సీట్ను కుక్క చింపివేయడాన్ని చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. షా ఇనుప రాడ్తో కుక్క తలపై పలుమార్లు కొట్టడంతో అది చనిపోయింది. అతడ్ని నియంత్రించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
మరోవైపు కొందరు ఈ ఘటనను తమ మొబైల్లో వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న బంగూర్ నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి షాను అరెస్ట్ చేశారు. జంతువులను చంపడం, హింసించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.