చల్లబడిన వాతావరణం .. నేడు, రేపూ పలు చోట్ల వర్షం
హైదరాబాద్/సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో ఏర్పడిన ఉపరితలద్రోణి కారణంగా సోమవా రం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసిం ది. రంగారెడ్డి జిల్లా గండిపేట, వికారాబాద్, హైదరాబాద్లోని ఆసిఫ్నగర్, శేరిలింగంపల్లి లో దాదాపు 5 సెంటీమీటర్ల చొప్పున, ములుగు జిల్లా ఆలుబాక, ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల, నిర్మల్ జిల్లా ముథోల్, భైంసా, కుబీర్, సారంగాపూర్, నిజామాబా ద్ జిల్లా దర్పల్లి, కమ్మర్పల్లి, జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచ డంతోపాటు పిడుగులు పడ్డాయి. వికారాబాద్ జిల్లాలో సోమవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. జిల్లావ్యాప్తంగా 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. సోమవారం అత్యధికంగా మెదక్లో 42 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వా నలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో
గ్రేటర్ హైదరాబాద్లో సోమవారం సాయం త్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామచంద్రాపురంలో 3.5 సెంటీమీటర్లు, పటాన్చెరులో 2.3, శేరిలింగంపల్లి 2 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.