హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా కల్లోలం నేపథ్యంలో కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నది. కొవాగ్జిన్కు భారత్తోపాటు 60 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలను కొవాగ్జిన్ ఉత్పత్తిలో భాగస్వాములనుచేయాలని నిర్ణయించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. భారత్లో ఉత్పత్తి పెంచేందుకు ఇటీవేల ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్, భారత్ ఇమ్యునోలాజికల్స్తో ఒప్పందాలు చేసుకున్నది. వీటికి అదనంగా భారత్లో ప్లాంట్లు నడుపుతున్న యురోపియన్, ఫ్రెంచ్ ఫార్మా కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.