న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత వారం రోజులకుపైగా ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
అదేవిధంగా దేశంలో ఇప్పటి వరకు 14.19 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయ్యిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం బయటి దేశాల నుంచి దేశంలోకి ఆక్సిజన్ రవాణా సవాల్గా మారిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ట్యాంకర్లను మూవ్మెంట్ను తాము పర్యవేక్షిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పాకిస్థాన్కు మరో 10 లక్షల డోసుల టీకాలు పంపిన చైనా
14 రోజులు కొవిడ్ కర్ఫ్యూ.. ప్రజారవాణా బంద్..!
ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ ప్రధాని ఫోన్..!
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!