మీరట్ : రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు బదులుగా ఒక రోగికి నీళ్లతో ఇంజెక్షన్ చేశారు. దాంతో ఆ రోగి మృతిచెందాడు. ఈ ఘటన మీరట్లో జరిగింది. ఈ కేసులో మీరట్కు చెందిన సుభార్తి మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో తర్వాత మీరట్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతున్నదని ఈ ఘటనతో తెలుస్తున్నది.
ఘజియాబాద్లోని కావినగర్లో నివసిస్తున్న శోభిత్ జైన్ను సుభార్తి మెడికల్ కాలేజీలోని కోవిడ్ వార్డులో చేర్చారు. శోభిత్ జైన్కు అక్కడి సిబ్బంది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. శుక్రవారం రోగి శోభిత్ జైన్ శ్వాస నిలిచిపోయింది. దీనిపై పోలీసు నిఘా బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించగా.. రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు బదులుగా నీళ్లను ఇంజెక్ట్ చేసినట్లు వారు చెప్పడంతో నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది. వారిని అరెస్ట్ చేసి సుభార్తి మెడికల్ కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఇంజెక్షన్ను సుభార్తి కాలేజీ వెలుపల రూ.25 వేలకు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసులు సుభార్తి ఉద్యోగులైన అభర్, అంకిత్లను గేట్ వద్దనే అరెస్ట్ చేశారు. బ్లాక్మార్కెటింగ్ చేయడానికి సుభార్తి గ్రూప్ ట్రస్టీ అతుల్ కృష్ణ భట్నాగర్ కారణమని విచారణలో తేలింది.
సుభార్తిలోని రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను బ్లాక్ లో అమ్మడానికి పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నదని ఎస్ఎస్పీ అజయ్ సాహ్ని చెప్పారు. ఒక్కో ఇంజెక్షన్ను బ్లాక్ మార్కెట్లో రూ. 25 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. రోగి శోభిత్ జైన్కు రెమ్డెసివిర్కు బదులుగా డిస్టిల్ వాటర్ను ఇంజెక్ట్ చేయడం వల్ల ఆయన చనిపోయినట్లు తమ నిఘాలో తేలినట్లు ఆయన పేర్కొన్నారు.
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు