కర్నూలు : శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి మహాస్వామిజీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు కర్ణాటకలోని బెల్గాం వైద్యులు నిర్ధారించారు. జగద్గురు పీఠాధిపతి మహాస్వామిజీ ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. భక్తులు ఆందోళన చెందొద్దు.. స్వామిజీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని పీఠాధిపతి పీఎస్ బ్రహ్మి కౌశిక్ మీడియాకు వెల్లడించారు.