రంగారెడ్డి : శంషాబాద్ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణించినది ఎవరన్నది సోమవారం గుర్తించారు. కారులో ప్రయాణించిన వారిలో మదాపూర్ కానిస్టేబుల్ గిరిప్రసాద్, హోంగార్డు సంగమేశ్వర్, మల్లేశ్ ఉన్నారని నిర్ధారించారు.
వీరు ముగ్గురు ఆదివారం కారులో యాదాద్రి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగుప్రయాణంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మీదుగా శంషాబాద్ వచ్చారు.
మార్గమధ్యలో ముగ్గురు స్నేహితులు మద్యం సేవించారు. మద్యం మత్తులో కారు నడిపిన కానిస్టేబుల్ గిరిప్రసాద్ వేగంగా రాంగ్రూట్లో కూలీలతో వెళ్తున్న లారీని ఢీకొట్టాడు.
కారుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు చలాన్ సైతం పోలీసులు గుర్తించారు. గిరిప్రసాద్ రక్తనమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపారు.
హోంగార్డు సంగమేశ్వర్ సైతం పూటుగా మద్యం సేవించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి