న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పాలసీదారులకు గుడ్న్యూస్. డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంతో ఎల్ఐసీ చేతులు కలిపింది. ఇక నుంచి ఎల్ఐసీ ప్రీమియాన్ని పేటీఎం నుంచి చెల్లించే అవకాశం దీని ద్వారా కలగనుంది. అన్ని రకాల ఎల్ఐసీ పాలసీల ప్రీమియాలనూ పేటీఎం ద్వారానే చెల్లించవచ్చు. తమ అన్ని రకాల డిజిటల్ పేమెంట్ల కోసం పేటీఎంకు అనుమతి ఇచ్చింది.
ఎల్ఐసీ డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందించడానికి మొత్తం 17 పేమెంట్ గేట్వేలు పోటీ పడగా.. చివరికి ఆ అవకాశం పేటీఎంకు దక్కింది. దీని ద్వారా ఇక నుంచి ఎల్ఐసీ పాలసీదారులు చాలా సులువుగా తమ ప్రీమియం చెల్లించే అవకాశం దక్కుతుంది.
కరోనా కారణంగా గతేడాది నుంచి ఎల్ఐసీ డిజిటల్ పేమెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో ఎల్ఐసీ రూ.60 వేల కోట్లను డిజిటల్ మోడ్ ద్వారానే పొందడం విశేషం. ప్రస్తుతం డిజిటల్ ద్వారా 8 కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతుండగా.. ఇది మరింత పెరగనుంది.
గుడ్న్యూస్.. నోటి ద్వారా ఇచ్చే రెమ్డెసివిర్ అభివృద్ధి చేసిన జుబిలంట్ ఫార్మా
మీ హోదాకు ఇది తగదు.. మన్మోహన్కు హర్షవర్ధన్ కౌంటర్
IPL 2021: రషీద్ఖాన్తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ