శామీర్పేట, ఏప్రిల్ 18: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మలారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట మండలం 12 టీమ్స్, మూడు చింతలపల్లి మండలంలోని 13 టీమ్స్కు నిర్వహించిన సీఎంఆర్ క్రికెట్ లీగ్ టోర్నీ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విన్నర్, రన్నర్లకు బహుమతులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం తరపున సీఎంఆర్ క్రికెట్ లీగ్ టోర్నీ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, సీఎంఆర్ లీగ్ టోర్నీ నిర్వాహకుడు, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.