వనపర్తి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కందిరీగ తండా గ్రామపంచాయతీ ఎద్దుల గేరి నుంచి బీజేపీ కార్యకర్తలు రాములు, తిరుపతి, రాములు, స్వామి, యాదయ్యల ఆధ్వర్యంలో దాదాపు 50 మంది టీఆర్ఎస్ లో చేరారు.
మంత్రి నిరంజన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్