అంజన్న సన్నిధిలో నిర్విఘ్నంగా హనుమాన్ చాలీసా పారాయణం
పంతొమ్మిదో రోజూ అభిషేకాలు..హారతి పూజలు
మల్యాల, ఏప్రిల్ 4: కొండగట్టు అంజన్న సన్నిధిలో మార్చి 17న ప్రారంభమైన హనుమాన్ చాలీసా పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. పంతొమ్మిదో రోజైన ఆదివారం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తులు 11 సార్లు పారాయణాన్ని పఠించారు. పూడూర్ గ్రామానికి చెందిన అంజన్న భక్త మండలి, మల్యాలకు చెందిన మఠాంజనేయస్వామి ఆలయ భజన బృందం, జగిత్యాలకు చెందిన వికాసతరంగిణి భజన మండలి సభ్యులు, కరీంనగర్కు చెందిన గాయకుడు శ్రీనివాస్ కలసి హనుమాన్చాలీసా పారాయణ పఠనం చేశారు. మల్లాపూర్ మండలానికి చెందిన 13 మంది హనుమాన్ దీక్షాపరులు హాజరయ్యారు. ఉత్సవమూర్తులకు ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం, హారతి పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, అయిల్నేని కోటేశ్వర్రావు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసశర్మ, ధర్మకర్తలు ప్రవీణ్, జున్న సురేందర్, కొంక నర్సయ్య, జాగృతి నాయకులు నీలగిరి రాజేందర్రావు, వొల్లాల శ్రీనివాస్గౌడ్, వొద్దినేని వెంకటేశ్వర్రావు ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
ఇండోనేషియాలో భారీ వర్షాల బీభత్సం.. 44 మంది మృత్యువాత
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన