ఈఎస్ఎస్ యూనిట్లకు ప్రతిపాదనలు
రూ. 21 కోట్లతో సీఎం గిరి వికాస్
ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగే
ఏటూరునాగారం, ఏప్రిల్ 3 : ప్రతి రోజూ ఒక్కో కేంద్రం లో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బందిని నియమించినట్లు ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగే తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. కరోనా వైరస్ రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్రాహ్మణపల్లి, కొడిశాల, కాటాపూర్, చెల్పాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మినహా అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాల, ములుగులోని ఏరి యా వైద్యశాలలో45 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు పీవో వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు నేరుగా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు ముందస్తుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని పీవో వెల్లడించారు. జిల్లాలో రెండో దశలో ఒక్కకేసు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, ఏటూరునాగారంలో నిర్వహిస్తున్న పోలీస్ కోచింగ్ సెంటర్ను కరోనా కారణంగా మూసేసినట్లు తెలిపారు.
ఈఎస్ఎస్కు ప్రతిపాదనలు
ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) కింద గిరిజన లబ్ధిదారులకు వివిధ యూని ట్లు అందజేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదనలు సిద్ధం చేశామని పీవో తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి 30వేల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారని దీంతో మరిన్ని నిధులు మంజూరు చేయాలని గిరిజన సంక్షేమశాఖ అధికారులను కోరినట్లు చెప్పారు. కేటాయించిన నిధుల ప్రకారం యూనిట్లను జిల్లాల వారీగా టార్గెట్ ఫిక్స్ చేసి కలెక్టర్ అనుమతితో గ్రామ సభలు నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.
రూ. 21 కోట్లతో సీఎం గిరి వికాస్
సీఎం గిరి వికాస్ పథకం కింద ఐటీడీఏ పరిధిలో రూ.21 కోట్లతో పనులు చేపడుతున్నట్లు పీవో వెల్లడించా రు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రూ.8 కోట్ల చొప్పున నిధులు కేటాయించగా ప్రాధాన్యతను బట్టి గిరిజన రైతుల భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించడం, బోర్లు వేయించినట్లు చెప్పారు. ఇంకా 150 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందిర జల ప్రభ పథకం కింద వేసిన బోర్లకు ముందుగా విద్యుత్ సౌకర్యం కల్పించి భూములను సాగులోకి తెచ్చినట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు రూ.5 కోట్లు మంజూరు కాగా, ఇక్కడ 225 మంది లబ్ధి పొందేలా ఏర్పాట్లు చేశామని, 210 వరకు సర్వే చేశామని 104 బోర్లకు డ్రిల్లింగ్ నడుస్తుందని పీవో తెలిపారు. వివిధ కారణాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో నిలిచిన రోడ్ల వివరాలను పరిశీలిస్తామని, సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు. మండల కేంద్రంలో నిలిచిపోయిన గిరిజన భవన్ పనులను తిరిగి చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ నడుస్తున్నదని, వారం రోజుల్లో టెండర్ పిలువనున్నట్లు తెలిపారు. అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన ఊరట్టం నుంచి కొండాయి మీదుగా ఐలాపూర్ రోడ్డుకు అనుమతి లభించినట్లు పీవో వెల్లడించారు.
ఇవి కూడా చూడండి..
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం