ఫరూఖ్నగర్ మండల సర్వసభ్య
సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీ
షాద్నగర్, మార్చి 15: మండలంలోని అన్ని గ్రామాల్లో, తండాల్లో తాగు నీటి సమస్య రాకుండా సంబంధితశాఖ అధికారులు, గ్రామాల ప్రజా ప్రతిని ధులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి సూచించారు. సోమవారం ఫరూఖ్నగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. మిషన్భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా కావా లని అందుకు మిగిలిపోయిన పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. పలు ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్లను సైతం వినియోగంలోకి తేవాలన్నారు. హరితహారం, పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో, గిరిజన తండాల్లో, రోడ్లకు ఇరువైపుల నాటిన చెట్లను సంరక్షించుకోవాలన్నారు. ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్లె ప్రగతి అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని, అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కోరారు. పలు గ్రామాల ఎంపీటీసీ, సర్పంచులు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. సకాలంలో నిధు లు మంజూరయ్యేలా ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని కోరారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్, అటవీ, పంచాయతీరాజ్, ఆర్డ బ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, విద్యాశాఖ, ఎన్ఆర్ఈజీఎస్, మహిళా సమాఖ్య, రెవెన్యూశాఖల అధికారులు మండలంలో చేపట్టిన పనులను, ప్రభుత్వ పథ కాల పనితీరును వివరించారు.
రూ. 21.05కోట్ల రైతు బంధు నిధులు
ఈ యేడు యాసంగి పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని రైతులకు రైతు బంధు పథకం ద్వారా రూ. 21కోటి 8 లక్షల 24వేల 365 లను అందించనున్నదని మండల వ్యవసాయ అధికారులు వివరించారు. 17వేల 914మంది రైతులకు గాను 17వేల 884మంది రైతుల బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. అదే విధంగా 2462 మంది రైతులు రైతు బంధు పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు బీమా పథకం ద్వారా 21మంది రైతు కుటుంబాలకు ఒకొక్క రైతుకు రూ. 5లక్షల చొప్పున రూ. కోటి 5లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో 432 కల్లాల నిర్మాణాల కోసం నిధులు మంజూరయ్యాని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
75శాతం రాయితీతో తుంపర సేద్యం పరికరాలు
తుంపర సేద్యం ద్వారా కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసుకునే రైతులకు రాష్ట్ర ఉద్యానశాఖ ద్వారా 75శాతం రాయితీతో పరికరాలను పం పిణీ చేస్తున్నామని ఉద్యానశాఖ అధికారి ఉషారాణి వివరించారు. ఈ పథ కానికి అన్ని వర్గాల రైతులు అర్హులని తెలిపారు. ఓసీ రైతులకు 80శాతం రాయితీతో బిందు సేద్యం, బీసీ రైతులకు 90శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలను అందిస్తామన్నారు. పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ పరంగా ప్రో త్సాహకం అందిస్తామని తెలిపారు.
చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవు
అడవుల సంరక్షణకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహ కారం అందించాలని ఆటవీశాఖ అధికారి శ్రావ్య కోరారు. ఎలాంటి అనుమ తులు లేకుండా చెట్లను నరికితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. హరితహారం ద్వారా నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్య త మనందరిపై ఉందన్నారు. సొంత పొలాల్లో ఉన్న చెట్లను నరకాలన్నా ఆట వీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఎంపీ డీవో శరత్బాబు, వైస్ ఎంపీపీ మౌనిక, ఎంపీటీసీ బీష్వ రామకృష్ణ, శ్రీశైలం, యాదయ్య, అరుణ, రాజు, లావణ్య, అరుణ, శివ రాజు, సర్పంచులు సం పత్, రాఘవేందర్, శ్రీశైలం, మాధవి, లక్ష్మీ, శ్రీని వాస్రెడ్డి, ఎంఈవో శంక ర్రాథోడ్, ఏపీఎం నాగేష్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.