అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆచూకీ లభించడంతో అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు అతడిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఛత్తీస్ఘడ్కు చెందిన శివమ్కుమార్ సాహు (6) కుటుంబం గత నెల 27న శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చింది. అలిపిరి బస్టాండ్ వద్ద కుటుంబం సేదతీరుతున్న సమయంలో ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కిడ్నాపర్ బాలుడిని తీసుకువెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బస్టాండులో సాహు కుటుంబం ఉన్న పక్కనే కిడ్నాపర్ పడుకుని పేపర్ చదువుతూ కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించి గాలింపు చేపట్టారు. చివరకు కిడ్నాపర్లే బాలుడిని విజయవాడలో దుర్గమ్మ ఆలయం వద్ద వదిలి వెల్లడంతో కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది.