గువాహటి: దేశంలో కాంగ్రెస్ పార్టీని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ అని, అందువల్ల ప్రజలు మరోసారి బీజేపీనే ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు. ఇవాళ అసోంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న స్మృతి ఇరానీ.. రాష్ట్రంలోని పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ, సీఎం సోనోవాల్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర సర్కారు అవిశ్రాంతంగా పనిచేస్తున్నదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అసోం నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు ప్రధానులు అయినా ఎయిమ్స్ ఆస్పత్రిని తీసుకురాలేకపోయారని, ప్రధాని మోదీ హయాంలోనే ఎయిమ్స్ ఆస్పత్రి వచ్చిందని ఆమె పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.