హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా.. ఇటీవలికాలంలో సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మాధ్యమం. వర్తమాన మీడియాను మించి వైరల్ అవుతున్న సోషల్మీడియా తీరుతెన్నులను ఓయూ డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్లో పాఠ్యపుస్తకాల్లో సోషల్మీడియా పాఠ్యాంశాన్ని సైతం చేర్చారు. ఉస్మానియా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ‘అండర్స్టాండింగ్ పొలిటికల్ థియరీ’ పేరుతో కొత్త పాఠ్య పుస్తకానికి రూపకల్పనచేయగా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆవిష్కరించారు. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, తెలుగు అకాడమీ జేడీ ఎం సోమిరెడ్డి, ప్రొఫెసర్ ముసలయ్య పాల్గొన్నారు.