అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి డోర్ టు డోర్ విరాళాల సేకరణను నిలిపివేసినట్లు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం తెలిపింది. అయితే ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రజలు విరాళాలు ఇవ్వవచ్చని పేర్కొంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ మేరకు శనివారం వెల్లడించారు. ఆలయం ముందున్న భూమి కొనుగోలుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలిపారు. రామాలయం నిర్మాణం మూడేండ్లలో పూర్తి కావచ్చని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.