హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి పలు విద్యా సంస్థలు, సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. ఈ మేరకు మంత్రి హరీశ్రావు నేతృత్వంలో దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత, విద్యావేత్త ఏవీఎన్ రెడ్డితో పాటు ట్రెస్మా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, ప్రతినిధి సురేందర్ రెడ్డి శనివారం సీఎం కేసీఆర్ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, నవీన్ రావు తదిరులు పాల్గొన్నారు.