నారాయణపేట టౌన్, ఆగస్టు 1 : స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్ర భుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. అంతేకాకుం డా బీమా సౌకర్యాన్ని కల్పించడంతో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నది. అందులో భాగంగా జిల్లాలో ప్రస్తు తం స్త్రీనిధి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నారు. అయి తే ఈ నెల నుంచి స్త్రీనిధి సురక్ష(బీ) పథకం అమలయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకున్న మహిళ మరణించినట్లయితే ఈ పథ కం ద్వారా రూ.లక్షా బీమా వర్తిస్తున్నది.
గతేడాది ప్రభుత్వం స్త్రీనిధి సురక్ష (బీ) పథకానికి శ్రీకా రం చుట్టినప్పటికీ జిల్లాలో స్త్రీనిధికి సంబంధించి దీర్ఘ కాలిక బకాయిలు ఎక్కువగా ఉన్నందు వల్ల పథకం అమలుపై అ ధికారులు దృష్టి సారించలేదు. అయితే ఈ ఏడాది పథకం అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. స్వయం సహాయక సంఘం సభ్యులు స్త్రీనిధి నుంచి రు ణం పొందినప్పుడు, తీసుకున్న రుణం మొత్తం సురక్ష పథ కం వారికి ఆర్థిక రక్షణ కల్పిస్తున్నది. దీని ద్వారా సభ్యురా లు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు రుణం భారం లేకుండా చేయడమే పథ కం ముఖ్య ఉద్దేశం. కానీ సురక్ష (బీ) పథకం ద్వారా రుణం తీసుకోనప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సభ్యులందరూ, వారి కుటుంబ సభ్యులు రక్షణ పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో సమావేశాలు నిర్వహించిన సమ యంలో అధికారులు ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను వి వరిస్తూ పథకంలో చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
పథకంలో చేరేందుకు అర్హతలు
18 నుంచి 60 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండి, ఏ,బీ,సీ, డీ గ్రేడ్లో ఉన్న గ్రామ, స్లమ్ సమాఖ్యలో సభ్యులుగా ఉండాలి.
ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి సర్టిఫికెట్ల ఆధారంగా సంఘం సభ్యులు తీర్మానంలో ధృవీకరించాల్సి ఉంటుంది.
చెల్లించాల్సిన రుసుము
ఈ సురక్ష(బీ) పథకంలో చేరిన ప్రతి సభ్యురాలికి రూ.లక్ష కవరేజ్ ఉంటుంది. పథకంలో చేరేందుకు సభ్యురాలు ఏడాదికి రూ.230 చొప్పున మూడేండ్లకు గానూ రూ.690 ఒకేసారి చెల్లించాలి. పథకంలో చేరిన తేదీ నుంచి మూడేండ్ల కాలానికి కవరేజీ ఉంటుంది. కాలపరిమితి పూర్తయిన తర్వాత మళ్లీ పథకంలో చేరేందుకు అవకాశం ఉం టుంది. పథకంలో చేరేందుకు మూడేండ్లకు కట్టాల్సిన రు సుం చెల్లించేందుకు స్త్రీనిధి ద్వారా అప్పును మంజూరు చే స్తారు. ఈ అప్పును 24 నెలలపాటు వాయిదాల పద్ధతిలో వార్షిక వడ్డీ 11.50శాతంతో చెల్లించావాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన సంఘం సభ్యురాలు మరణించిన సమయంలో అంత్యక్రియల నిర్వహణకు కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఆర్థికసాయం అందజేస్తారు. జిల్లాలో మొత్తం 403 గ్రామ సంఘాలు ఉండగా, మొత్తం 8 వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా మొత్తం 21,500 మంది మహిళలు సభ్యులకు లబ్ధి చేకూరనున్నది.
ప్రతి మనిషికి బీమా అవసరం…
ప్రతి మనిషికి బీమా అవసరం. ఈ పథకంలో చెల్లించేంత తక్కువ ప్రీమియం ఏ పథకంలో లేదు. జిల్లాలో సమావేశాలు నిర్వహించడంతో ఈ పథకంపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి సభ్యురాలు పథకంలో చేరేలా చర్యలు తీసుకుంటాం. స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ సురక్ష(బీ) పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-తిరుపతి, స్త్రీనిధి జిల్లా మేనేజర్, నారాయణపేట
బీమా వల్ల రక్షణ..
సురక్ష(బీ) పథకంలో చేరడం వల్ల సంఘం సభ్యురాలితోపాటు కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక రక్షణ కలుగుతున్నది. మండలంలో ఉన్న 989 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 10,649 మంది సభ్యులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. సంఘంలోని ప్రతి సభ్యురాలు సురక్ష(బీ) పథకంలో చేరి బీమా పొందాలి.
-శకుంతల, ఏపీఎం, నారాయణపేట