నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తున్నా రు. విత్తనాలు విత్తడం మొదలు కొనుగోళ్ల వర కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీ సుకుంటున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనా లు, పురుగుల మందులు అందించడం, నిరంతర ఉచిత విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంటల కు గిట్టుబాటు ధరలను సైతం కల్పిస్తున్నది. అ యితే, రైతులకు పంటల కొనుగోళ్లు సులభం గా మార్చేలా ప్రతి ఏడాది పంటలు చివరి దశకు వచ్చే సమయంలో పంటల గణన చేపడుతుండడం గమనార్హం. వ్యవసా య శాఖ ఆధ్వర్యంలో ఏఈవోలు, వీఆర్వోలు సంయుక్తంగా గ్రామాల్లోని వ్యవసాయ క్లస్టర్లలో పంటల గణన చేపడుతున్నారు. ప్రస్తుతం తు ది దశకు చేరుకున్నది. ఈనెల 15వ తేదీతో వాస్తవంగా పంట గణన తుది గడువు పూర్తయింది. కానీ కొన్ని గ్రా మాల్లో ఏఈవోలు రైతుల నుంచి ఆలస్యంగా వ చ్చిన వివరాలను నమోదు చేస్తున్నారు. 13 అం శాలతో పంటల వివరాలు సేకరిస్తున్నారు. రైతు లు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారు..?, నీటి వసతి, అంతర పంటలా లేక విడి పంట లా..? వంటి అంశాలను పొందుపరుస్తున్నారు. సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చే స్తున్నారు. గతంలో రైతు యూనిట్గా సర్వే చేపట్టగా.., ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేస్తుండడం విశేషం.
దీంతో సాగు లెక్కల్లో చిన్న తారతమ్యాలు లేకుండా ఉండనున్నాయి. ప్రభుత్వం మార్కెటింగ్ ప్రకా రం పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సూచనలు అందిస్తున్నది. ప్రస్తుతం నూ నె గింజల పంటలకు అధిక ధరలు, సులభమైన మార్కెటింగ్ విధానం అందుబాటులో ఉంటున్నాయి. వచ్చే యాసంగి సీజన్ నుంచి వరికి ప్ర త్యామ్నాయంగా నూనె గింజలు సాగు చేయాల ని ప్రభుత్వం కోరుతున్నది. ఈ క్రమంలో ప్ర స్తుతం రైతులు పండించిన పంటల వాస్తవ వివరాలు ప్రభుత్వానికి చేరనున్నాయి. దీని ప్ర కారం రానున్న సీజన్లో ఎంత పంట దిగుబడి వస్తుందనే అంచనా ఏర్పడనున్నది. దీని ఆధారంగా రైతుల ధాన్యం కొనుగోళ్లకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు, ఏయే చోట ఏర్పాటు చే యాలనే విషయాలపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. రైతులకు కొనుగోళ్లు సులభతరం చేయాలన్నదే ఈ పంటల సర్వే ప్రధాన ఉద్దేశం. నాగర్కర్నూల్ జిల్లాలో గత వానకాలంలో 6,13,878 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 6.84 లక్షల ఎకరాలు అంచనా కాగా, 5.41 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు అధికారులు గణన ద్వారా నిర్ధారించారు. వరి 1,25,861, జొన్నలు 1,861, మొక్కజొన్న 50,263, కంది 7,637, పెసర్లు 57, మినుములు 1,972, వేరుశనగ 1,723, ఆముదం 192, పత్తి 3,51,283, చెరుకు 38, ఇతర పంటలు 531 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు తెలిపారు.
పంటల గణన పూర్తి..
నాగర్కర్నూల్ జిల్లాలో పంటల గణన పూర్తయింది. ఈ ఏడాది 6.84 లక్షల ఎకరాలకు గానూ 5.41 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. రానున్న కాలంలో పంటలు కొనుగోళ్లు చేపట్టేందుకు ఈ గణన ఉపయోగపడుతుంది. సర్వే నెంబర్ల వారీగా గణన చేపట్టాం. జిల్లాలో అత్యధికంగా 3.51 లక్షల ఎకరాల్లో పత్తి, 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతుల
నుంచి సేకరించిన సర్వే వివరాలన్నింటినీ
ప్రభుత్వానికి నివేదించాం.