కల్వకుర్తి, అక్టోబర్ 8: కల్వకుర్తి పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ధనలక్ష్మిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రూ. 10లక్షల నగదుతో అమ్మవారిని అలంకరించారు. గంగాపురం అక్ష్మీనారాయణస్వామి ఆశ్రమ మళయాళస్వామిజీ హాజ రై భక్తులకు ఆధ్మాత్మిక ప్రవచనాలు వినిపించారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ స త్యం అమ్మవారికి పూజలు నిర్వహించా రు. ఐటీసీ ఆధ్వర్యంలో మహిళలకు ము గ్గుల పోటీలు నిర్వహించగా విజేతలకు చైర్మన్ బహుమతులు అందజేశారు. అ నంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ము న్సిపల్ చైర్మన్, స్వామీజీలకు సన్మానం చేశా రు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జూలూ రి రమేశ్బాబు, ఉత్సవ కమిటీ సభ్యులు త దితరులు పాల్గొన్నారు.
బాలా త్రిపురసుందరీదేవిగా..
దసరా నవరాత్రుల్లో భాగంగా ఆయా గ్రామాల్లోని మండపాల్లో కొలువైన దుర్గామాతకు పూజలు రెం డోరోజు కొనసాగాయి. అమ్మవారు శుక్రవా రం బాలా త్రిపురసందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మహాలక్ష్మిదేవి అలంకరణలో..
మండలంలోని ఆయా గ్రామాల్లో అమ్మవారు శుక్రవా రం మహాలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి ప్రత్యేక అలంకరణ అ నంతరం పూజలు చేశారు. అదేవిధంగా ప ట్టణంలోని గాంధీనగర్ కాలనీలో పెద్దమ్మతల్లి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి రూ.ఐదువందలు, రూ.వంద నోట్లతో అ లంకరించి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గుండాలలో..
మండలంలోని గుం డాల ఆలయంలో అమ్మవారు శనివారం బాల త్రిపురసుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మండలకేంద్రంలోని బుధార్పేట ఆంజనేయస్వామి ఆలయంలో కొలువైన అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.