నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23: జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, అసంపూర్తిగా ఉన్న రహదారులకు మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూసేకరణ, ఇతర అంశాలపై తన చాంబర్లో రోడ్లు భవనాలశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కల్వకుర్తి-ఆంధ్రప్రదేశ్ కర్వేన వరకు మంజూరైన 160 కిలోమీటర్ల జాతీయ రహదారి, జిల్లా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని జిల్లావ్యాప్తంగా చేపడుతున్న 62 రహదారుల 461 కిలోమీటర్ల నిర్మాణం, వాటి ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. ఏమేరకు పని జరిగింది? మంజూరైన నిధులు ఎన్ని? ఖర్చు చేసిన నిధులెన్నీ? ఇంకా ఎంత పని మిగిలి ఉందనే అంశాల వారీగా నివేదికలతో శాఖాపరమైన సమీక్షకు హాజరు కావాలని ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, రహదారుల నివేదికలు సమర్పించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్ల వివరాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నూతన కలెక్టరేట్ పనులపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ ఈఈ భాస్కర్, నాగర్కర్నూల్, అచ్చంపేట డీఈలు రమాదేవి, నాగలక్ష్మి పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
జిల్లాలోని దివ్యాంగుల స మస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ఉదయ్కుమార్ హామీ ఇచ్చారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సం దర్భంగా దివ్యాంగులు గురువారం మొదటిసారి కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి దివ్యాంగుడి కుటుంబానికి అంత్యోదయ రేషన్కార్డు మంజూరు చేయాలని, ప్రతి ఏడాది బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లో 5శాతం రిజర్వేషన్ కల్పించాలని, జిల్లాలో ఉన్న దివ్యాంగుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ను కలిసిన వారిలో జాతీయ వేదిక సంఘం సభ్యులు రవిశంకర్, రామ్మోహన్, అంజయ్య తదితరులున్నారు.