ములుగు : మేడారం జాతరలో అపశృతిచోటు చేసుకుంది. వనదేవతల దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు మూర్చ వ్యాధితో కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే..గురువారం అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్న వెంకట నారాయణ (65) అనే వ్యక్తి మూర్చ వ్యాధితో అక్కడే కుప్పకూలిపోయాడు.
గమనించిన భక్తులు అతడిని దవాఖనకు తరలిద్దామనే లోపే మృతి చెందాడు. మృతుడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.