వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. దాదాపుగా పదివేలపైన భక్తులు, పర్యాటకులు శ్రీరామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామప్ప విశిష్టతను టూరిజం గైడ్ ద్వారా తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక మాసం కావడంతో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి చెట్టు కింద శివలింగం వద్ద దీపాలు వెలింగించి పూజలు చేశారు. అనంతరం రామప్ప సరస్సుకు చేరుకోని బోటింగ్ చేసి ఆహ్లాదంగా గడిపారు.