ములుగు : జిల్లాలో మరో రెండు మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో 1, తాడ్వాయి మండలం మేడారం, ఊరట్టం గ్రామాల పరిధిలో మరో మద్యం షాపు ఏర్పాటుకు శుక్రవారం నుంచి వచ్చే నెల డిసెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మూడో తేదీన లక్కీడ్రా ప్రకారం షాపులను కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.