వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి కలెక్టర్ భవేష్మిశ్రా, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజరులు హరీశ్శర్మ, ఉమాశంకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. టూరిజం గైడ్ ద్వారా రామప్ప విశిష్టత తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ రామప్ప శిల్పకళా అద్భుతమన్నారు. రానున్న మేడారం జాతరకు ప్రభుత్వం తరపున భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, దానికి సంబందించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని తాసిల్దార్ మంజులకు సూచించారు.
అనంతరం రామప్ప సరస్సుకు చేరుకోని బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. వారి వెంట పాలంపేట సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్, ఆర్ఐ. రాజకుమారి, పంచాయతీ కార్యదర్శి నిరంజన్, కారోబార్ రవి, వీఆర్వో రమేశ్, వీఆర్ఏలు కిషన్, శంకర్, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.