నర్సంపేట, మే 23 : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో మందులు వాడి వైద్యుల సూచనలు పాటిస్తే నియంత్రించవచ్చని అధికారులు, వైద్య సిబ్బంది అన్నారు. ఆదివారం నర్సంపేటలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ మాట్లాడుతూ జ్వరం వచ్చిందంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు వాసన, రుచి కోల్పోతారని, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయని తెలిపారు. కరోనా లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని ఆమె కోరారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వేచి చూడొద్దని, ఎలాంటి స మస్యలున్నా వైద్య సిబ్బందికి తెలుపాలని సూచించారు.
నర్సంపేట రూరల్లో..
నర్సంపేట రూరల్ : కరోనా బాధితులు అదైర్య పడొద్దని ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యాలమ్మతండా, ఇప్పల్తండా, ఏనుగల్తండా, మహేశ్వరం గ్రామాల్లో కరోనా ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హోంఐసొలేషన్లో ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నాగేశ్వర్రావు కోరారు. మరోవైపు మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది జ్వర పీడితుల వివరాలను నమోదు చేసుకున్నారు. భోజ్యనాయక్తండా, గురిజాల, చిన్న గురిజాల, జీజీఆర్పల్లి, ఆకులతండా, నర్సింగాపురం, మహేశ్వరం, రాజేశ్వర్రావుపల్లి, చంద్రయ్యపల్లి గ్రామాల్లో సర్పంచ్లు భూక్యా లలిత, గొడిశా ల మమత, గడ్డం సుజాత, తుత్తూరు కోమల, రాము, రవిందర్, కవిత, యువరాజ్, లావణ్య ఆధ్వర్యంలో కార్యదర్శులు, వైద్య సిబ్బంది జ్వర పీడితుల వివరాలను నమోదు చేయించారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండలంలోని బండమీదిమామిడి తండాలో వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో జ్వరపీడితుల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడ లక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారందరికీ మెడికల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత జర్వ సర్వే పరకాల మున్సిపాలిలటీతో పాటు పరకాల, నడికూడ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం జరిగింది. ఈ నెల 6న మొదటి విడుత జర్వ సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లను పంపిణీ చేయగా రెండో విడుతలో మరోసారి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బం ది, రెవెన్యూ సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేశారు.
శాయంపేటలో..
శాయంపేట : మండలంలోని గ్రామాల్లోని రెండో విడత ఇంటింటి జ్వర సర్వే ఆదివారం ప్రారంభమైంది. కరోనా ప్రబలుతున్న క్రమంలో సర్వే చేపట్టి వైరస్ను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి తెలిపారు. మొదటి విడుత సర్వేలో 365 మందిలో కరోనా లక్షణాలను గుర్తించి మెడికల్ కిట్లను ఇచ్చామన్నారు. రెండో విడుత సర్వేలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
సంగెంలో..
సంగెం : మండలంలోని గవిచర్ల, కుంటపల్లి గ్రామా ల్లో వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వర లక్షణాలున్న వారి వివరాలు నమోదు చేసుకుని మెడికల్ కిట్లను అందజేశారు. గవిచర్లలో సర్వేను జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, తహసీల్దార్ విశ్వనారాయణ, కుంటపల్లిలో ఎంపీపీ కళావతి, డాక్టర్ పొగాకుల అశోక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు దొనికెల రమాశ్రీనివాస్, కావటి వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, నరహరి పాల్గొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి : ఇంటింటి జర్వ సర్వేకు ప్రజలు సహకరించి వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని రాయపర్తి, కొండాపురం గ్రామాల సర్పంచ్లు గారె నర్సయ్య, కోదాటి దయాకర్రావు కోరారు. ఆదివారం ఆయా గ్రామాల్లో చేపట్టిన సర్వేలో వైద్య సిబ్బందితో కలిసి స్వయంగా వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీల కార్యదర్శులు గుగులోత్ అశోక్నాయక్, కారుపోతుల రాంచంద్రయ్య, గాదె శ్రీనివాస్, వైద్యారోగ్య సిబ్బంది జయలత, పద్మ, సరస్వతి, రాజేశ్వరి, అరుణ పాల్గొన్నారు.