పరకాల, ఏప్రిల్ 22: పరకాల ము న్సిపాలిటీ టీఆర్ఎస్ పాలనలోనే అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, పట్టణాన్ని అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి అన్నారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో ఉపఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్య ర్థి చిదురాల దేవేందర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, ప్రచారానికి వెళ్లిన మహిళా నాయకులు సంగ నర్సింహ రాములు (నర్సయ్య) అనే వృద్ధుడితో ముచ్చటిస్తుండగా వారి మెడ లో ఉన్న టీఆర్ఎస్ కండువాపై ఉన్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫొటోలను చూస్తూ కండువాను చేతుల్లోకి తీసుకున్నాడు. ‘గులాబీ కండువా మాకు అండగా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ మాకు పెద్ద కొడుకు వంటి వాడని, వృద్ధాప్య పింఛన్ ఇస్తూ భరోసా ఇచ్చాడు’ అని అన్నాడు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ రేగూరి విజయ్పాల్రెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, ఒంటేరు సార య్య, పొరండ్ల సంతోశ్, ఏకు రాజు, గోపి, టీఆర్ఎస్ నాయకులు మడికొండ శ్రీను, చందుపట్ల సాయిని తిరుపతిరెడ్డి, శనిగరపు నవీన్, మార్క రఘుపతి, పసుల రమేశ్, నల్లెల అనిల్, దుప్పటి సాంబశివుడు, పంచగిరి సుధాకర్, చందుపట్ల నర్సింహారెడ్డి, మహిళా నాయకులు గంట కళావతి, ఎండీ రోజా, బండి శ్రావణి, అల్లం సుమలత పాల్గొన్నారు.
9వ వార్డు ఉప ఎన్నిక బరీలో ముగ్గురు
9వ వార్డు ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. గురువారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగియడంతో అధికారులు బరీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి చిదురాల దేవేందర్, కాంగ్రెస్ నుంచి దార్న వేణుగోపాల్, బీజేపీ నుంచి బెజ్జెంకి పూర్ణాచారి బరీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021 : విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రాహుల్
ఈ యాప్లు మీ మొబైల్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి