వర్ధన్నపేట, ఏప్రిల్ 22: పల్లె, పట్టణప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అధికారులతో పట్టణ ప్రగతిలోని పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని నర్సరీల్లో ఎంచుకున్న లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలని, రానున్న వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటి పూర్తిగా సంరక్షించుకోవాలని సూచించారు. బస్టాండ్, ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, డ్రైనేజీ, ఇతర అంతర్గత రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా కరోనా వాక్సినేషన్ సజావుగా నిర్వహించి ప్రతిఒక్కరికీ టీకా అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ల్యాబర్తిలో ఉపాధి పనులను, వసతులను పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆం గోతు అరుణ, వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు రవీందర్, రాజమణి, సమ్మెట సుధీర్, సుజాత, సోమయ్య, మున్సిపల్ అధికారులు, ల్యాబరి సర్పంచ్ రాజు, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి, ఉపసర్పంచ్ కళింగరావు, ఏపీవో నాగేశ్వర్ పాల్గొన్నారు.
‘ఉపాధి’తో ఆర్థిక వృద్ధి సాధించాలి
రాయపర్తి: ఉపాధి హామీ పనులను అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక వృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ కోరారు. గురువారం మండలంలోని బంధన్పల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.
మొక్కల సంరక్షణకు పెద్దపీట వేయాలి
గ్రామంలోని నర్సరీని సర్పంచ్ భూక్యా దీప్లానాయక్, ఉపాధి ఏపీవో దొణికెల కుమార్గౌడ్, పంచాయతీ కార్యదర్శి బిర్రు రాధికతో కలిసి ఆయన సందర్శించారు. నర్సరీల్లోని మొక్కలు ఎండిపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డు సభ్యులు, వన సంరక్షులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పేలిన బాంబులు..ఆపరేషన్ సక్సెస్
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?