వాజేడు, మే 18 : మండలంలోని పేరూరు గ్రామ పంచాయతీలోని పేరూరుపేట, చిన్నగొల్లగూడెం గ్రామా ల్లో కరోనా కేసుల సంఖ్య 50కి పైగా చేరుకోవడంతో రెవెన్యూ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు మంగళవారం పర్యటించారు. పేరూరు పేటలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాలని కలెక్టర్కు నివేదించినట్లు తహసీల్దార్ అల్లం రాజ్కుమార్ తెలిపారు. గ్రామస్తులకు నిత్యావసర సరుకులను గ్రామ పంచాయతీ ఆధ్వ ర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. కాగా, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు మైక్ ద్వా రా ప్రచారం చేశారు. కొన్ని వీధుల్లో ఎడ్లబండ్లను దారికి అడ్డంగా పెట్టారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, వైద్యాధికారి సీతారామరాజు నరహరి, ఆర్ఐ హరి మురళీకృష్ణ, సర్పంచ్ యాలం సరస్వతి, పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం : మండలంలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో మండల కేంద్రంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో 8 మంది వరకు కరోనాతో మృతి చెందారు. దీంతో సర్పంచ్ సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించేందుకు ముందుకు రావడంతో కిరాణా షాపులు, హోటళ్ల యజమానులు, ఇతర వ్యాపారులు ఇందుకు సమ్మతించారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని వర్గాలకు చెందిన వ్యాపారులు, సంఘాలు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉన్నది.