ములుగురూరల్, మే 18 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పత్తిపల్లి ఎంపీటీసీ నూనావత్ మహేశ్నాయక్ కోరారు. మంగళవారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ డైరెక్టర్ హర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్నాయక్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.