సంగెం, ఏప్రిల్ 16 : సంగెం ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిం ది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 13 టీసీలకు 12 టీసీ ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాం గ్రెస్ ఒక టీసీ గెలుపొందింది. గెలుపొందిన అభ్యర్థుల కు ఎన్నికల అధికారి నాగనారాయణ ధ్రువీకరణ పత్రా లు అందజేశారు. సొసైటీలో మొత్తం 2883 ఓట్లకు2284 ఓట్లు పోలయ్యాయి. 25 ఓట్లు చెల్లకుండా పోయాయి. 79శాతం పోలింగ్ నమోదైంది.
గెలుపొందింది వీరే..
1వ టీసీలో పులి వీరస్వామి(టీఆర్ఎస్), 2వ టీసీ గోపతి రాజ్కుమార్ (టీఆర్ఎస్), 3వ టీసీ పోశాల మల్లయ్య (టీఆర్ఎస్), 4వ టీసీ దామెర పరమలత (టీఆర్ఎస్),5వ టీసీ మేరుగు శ్రీనివాస్ (టీఆర్ఎస్), 6వ టీసీ కొట్టం రాజు (టీఆర్ఎస్), 7వ టీసీ గుగులో తు రమ (టీఆర్ఎస్), 8వ టీసీ సపావట్ కిషన్నాయక్ (టీఆర్ఎస్), 9వ టీసీ ఇమ్మడి ప్రవీణ్ (టీఆర్ఎస్), 10వ టీసీ జనగాం రమేశ్ (కాంగ్రెస్), 11వ టీసీ జా టోత్ యీరామ్ (టీఆర్ఎస్), 12వ టీసీ కడారి సులోచన (టీఆర్ఎస్), 13వ టీసీలో వేల్పుల కుమారస్వా మి (టీఆర్ఎస్) విజయం సాధించారు.
ప్రశాంతంగా ఎన్నికలు..
సంగెం సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల సరళిని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్, సంగెం ఎస్సై సురేశ్ పరిశీలించారు. గెలుపొందిన అభ్యర్థులను జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి అభినందించారు.
నేడు చైర్మన్ ఎన్నిక..
నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనున్నట్లు ఎన్నికల అధికారి నాగనారాయణ తెలిపారు. సంగెం సొసైటీ కార్యాలయంలో 9గంటలకు ఎన్నిక జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే చల్లాను కలిసిన విజేతలు..
సంగెం ప్రాథమిక సహకార ఎన్నికల్లో విజయం సా ధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విజేతలను అభినందించారు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నరహరి, మండలాధ్యక్షుడు సారంగపాణి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ దోపతి సమ్మయ్యయాదవ్, వేల్పుల కుమారస్వామి యాదవ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
డాలర్తో 58 పైసలు బలపడిన రూపాయి