నాలుగు వాహనాలు సీజ్
36 వాహనాలు, 2 దుకాణాలపై కేసు
రూ.3,18,930 జరిమానా విధింపు
జయశంకర్ భూపాలపల్లి, మే 15(నమస్తేతెలంగాణ) : కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 325 కేసులో నమోదైనట్లు జయశంకర్ భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ డీఎస్పీలు ఆవిరినేని సంపత్రావు, బోనాల కిషన్ తెలిపారు. సడలింపు సమయం ముగిశాక, అనవసరంగా బయటకు వచ్చిన నాలుగు వాహనాలను సీజ్ చేశారు. 36 వాహనాలు, రెండు షాపులపై కేసులు పెట్టారు. 283 మందిపై ఈ-పిటీ కేసులు నమోదు చేశారు. రెండు సబ్ డివిజన్ల పరిధిలో విధించిన 325 కేసులకు గాను రూ. 3,18,930 జరిమానా విధించినట్లు డీఎస్పీలు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్డౌన్ను ప్రజలు విధిగా పాటించాలని, సడలింపు సమయంలోనే పనులు పూర్తి చేసుకొని, మిగిలిన 20 గంటల సమయం ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు.