ఇందుకు అనుగుణంగా ఎన్నికల నియమావళిలో మార్పులు తేవాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం
హన్మకొండ చౌరస్తా, జూన్ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై తొలిసారిగా హైదరాబాద్కు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణతో ఉన్న అనుబంధంతో కలిసి పలు విషయాలపై కలిసి చర్చించారు. ఎన్నికల నియమావళిలో సమూల మార్పులు తీసుకొచ్చి సామాన్యులు సైతం పోటీ చేసేలా వ్యవస్థను మార్చాలని కడియం శ్రీహరి కోరారు. జస్టిస్ రమణ నేతృత్వంలో న్యాయవ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. వరంగల్లో పర్యటించాలని సీజేఐని మంత్రి ఎర్రబెల్లి ఆహ్వానించారు.