మహదేవపూర్, మే 11 : కరోనా వైరస్ను అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ఎదుర్కోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం లో కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం కరోనాను నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ దిశగా జాగ్రత్తలు తీసుకుంటూ సంఘటితంగా పనిచేద్దామని సూచించారు. ఇప్పటికే గ్రామాల్లో ఇంటిం టా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. మహదేవపూర్ సా మాజిక వైద్యశాలలో 20 పడకల ఆక్సిజన్ సౌక ర్యం ఏర్పాటు చేశామని, బాధితులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. వైద్యశాలలో సిబ్బంది కొరత ఉన్నట్లు దృష్టికి వచ్చిందని ఐదుగురు స్టాఫ్ నర్సులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. దవాఖా నలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చా రు. సమావేశంలో ఎంపీపీ బన్సోడ రాణీబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కృష్ణవేణి, మండల వైద్యాధికారి రా మారావు, వైద్యశాల సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.