ములుగురూరల్, జూన్ 8: ములుగు మండలంలోని రాయినిగూడెం, పంచోత్కులపల్లి పెగడపల్లి, కొత్తూరు, అంకన్నగూడెం, సర్వాపురం గ్రామాల్లో 150 కుటుంబాలకు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రక్షణ అందించడంతో పాటు నిరుపేదలకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్న ట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయ, సహకాలు అందించాలని కోరారు. ఆర్థికంగా సాయమందించిన దగ్గుబాటి రాణాకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ గుంటి శ్రీధర్, ఎస్సై ఓంకార్యాదవ్, పెగడపల్లి సర్పంచ్ లమి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పేదలకు నిత్యావసరాల పంపిణీ
మహదేవపూర్: ప్రజల క్షేమం కోసం పోలీసుశాఖ పనిచేస్తోందని కాటారం డీఎస్పీ బోనాల కిషన్పటేల్ అన్నారు. మండలంలోని పెద్దంపెట, సూరారం గ్రామాల్లో పేదలకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహదేవపూర్ సీఐ కిరణ్, ఎస్సై రాజ్కుమార్ సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి : సీఐ
గణపురం: మండలంలోని ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సీఐ పులి వెంకట్గౌడ్ అన్నారు. అప్పయ్యపల్లి కంటోన్మెంట్ జోన్ను ఆయన పరిశీలించారు. గ్రామానికి రాకపోకలు తగ్గించాలన్నారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం యూనియన్ బ్యాంక్ వద్దకు ప్రజలకు కౌన్సెలింగ్ ఇచ్చరు. కార్యక్రమంలో ఎస్సై రాజన్బాబు, కానిస్టేబుళ్లు సందీప్, సతీశ్, రతన్సింగ్, సాంబయ్య, నేతాజీ పాల్గొన్నారు.
హోంకేర్ మెడికల్ కిట్ల పంపిణీ
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామంలో కరోనా బాధితులకు మంగళవారం హోంఫర్ సేవా ఆధ్వర్యంలో హోంకేర్ మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. సేవాభారతి భూపాలపల్లి సేవాప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య కిట్లు అం దించారు. గ్రామ భారతి జిల్లా ప్రముఖ్ సుబ్బారెడ్డి, ఆశవర్కర్లు, శ్రీలత, భారతి, యువజన స మాఖ్య సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు.