ములుగుటౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోదాంలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎం గోదాంలను పూర్తి స్థాయిలో అన్ని హంగులతో సీసీ కెమెరాల నడుమ అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అప్పగించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. జిల్లా మొదటి అస్సెట్గా ఈవీఎం గొదాం మిగిలిపోతుందన్నారు.
ములుగు జిల్లా నియోజక వర్గానికి సంబంధించిన వీవీ ప్యాడ్స్కు పటిష్ట భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని సమర్ధవంతంగా పని చేస్తున్న కలెక్టరేట్ ఏవో శ్యాంను అభినందించారు. ఆయన వెంట డీఆర్వో రమాదేవి, ఎలక్షన్ డీటీ రాజు, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.