తాడ్వాయి: గ్రామాల్లో పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎఫ్ఆర్సి కమిటీ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిదిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాల కాలంగా పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టందని, పోడు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.
ఎలాంటి అవకతవకలు జరగకుండా పోడు భూములను గుర్తించేందుకు 10మందితో కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ పారదర్శకంగా పనిచేసి అసలైన పోడు రైతులను గుర్తించాలని, నిబంధనల ప్రకారం పోడు రైతులకు హక్కుల పత్రాలను మంజూరు చేస్తామని ఆమె అన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ వెంట తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, వీఆర్ఓ వీరాస్వామి, సర్పంచ్ సునీల్లు పాల్గొన్నారు.