Mulugu
- Jan 19, 2021 , 01:17:53
VIDEOS
శాఖల వారీగా జిల్లా ప్రగతి నివేదిక సమర్పించాలి : అదనపు కలెక్టర్

ములుగు టౌన్, జనవరి 18 : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాఖల వారీగా జిల్లా ప్రగతి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తులపై రోజువారీ సమీక్ష చేసి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు ప్రజల నుంచి 1,933 విజ్ఞప్తులు రాగా 1,417 పరిష్కరించగా మిగతావి పరిష్కారదిశలో ఉన్నాయన్నారు. అనంతరం తెలంగాణ కో ఆపరేటివ్ అధికారుల డైరీని అదనపు కలెక్టర్, డీఆర్వో రమాదేవి, సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమీక్షలో జడ్పీ సీఈవో ప్రసూనారాణి, డీఆర్డీవో పారిజాతం సీపీవో రవి, డీఎస్వో విజయ భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
MOST READ
TRENDING