ఎర్రుపాలెం, జూన్14: మండలంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా రాజులదేవరపాడులో అనారోగ్యానికి గురైన వేమిరెడ్డి కృష్ణారెడ్డిని పరామర్శించారు. గ్రామానికికి చెందిన పిట్టల వెంకయ్య మృతిచెందగా ఆయన కుటుంబాన్ని కలిశారు. అనంతరం బీమవరంలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ పనులను పరిశీలించారు. గ్రామంలోని ఐసోలేషన్సెంటర్లో కరోనా బాధితులకు భోజనం అందించారు. గుంటుపల్లి గోపవరంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామానికి చెందిన సుధాకర్కు మంజూరైన రూ.42 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. రామన్నపాలెంలో అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న ఓ మహిళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు చావా రామకృష్ణ, శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, శీలం వెంకట్రామిరెడ్డి, సర్పంచ్లు మొగిలి అప్పారావు, శీలం జయలక్ష్మి, కోట శ్రీనివాసరావు, కొత్తపల్లి విద్యాసాగర్, ఎంపీటీసీలు సంక్రాంతి కృష్ణారావు, నరసింహ, సొసైటీ అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ
పొంగులేటి పరామర్శ
మధిరరూరల్, జూన్ 14: ఆపత్కాలంలో అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పట్టణ పరిధిలో మృతిచెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు మొండితోక సుధాకర్ తండ్రి ప్రేమానందం మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని, ఇటీవల మృతిచెందిన మల్లవరానికి చెందిన మందడపు నాగేశ్వరరావు కుటుంబాన్ని, మధిరలో టీఆర్ఎస్ నాయకుడు పల్లబోతుల ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు వేంరెడ్డి లక్ష్మారెడ్డి, యన్నం కోటేశ్వరరావు, కోట రాంబాబు, దేవిశెట్టి రంగారావు, చెరుకూరి నాగార్జున్, సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి, మాటూరుపేట సర్పంచ్ రావూరి శివనాగకుమారి, ఎంపీటీసీ అడపా వెంకటేశ్వరరావు, రావూరి రాము, అమరవాది కోటిరెడ్డి, సిద్దినేనిగూడెం పాల్గొన్నారు.
మధిర పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పల్లపోతు ప్రసాదరావు తండ్రి పల్లపోతు గురునాథం ఇటీవల మృతిచెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పరామర్శించారు. అనంతరం పట్టణవాసి ఆవుల రామకృష్ణ తల్లి ఇటీవల మృతిచెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత పలువురు బాధిత కుటుంబాలను కలిశారు. జడ్పీ చైర్మన్ వెంట టీఆర్ఎస్ నాయకులు కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, యన్నంశెట్టి అప్పారావు, ప్యారీ, ఇక్బాల్, జేవీ రెడ్డి, సయ్యద్ ఇక్బాల్ ఉన్నారు.
కూసుమంచి రూరల్, జూన్14: టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు చాట్ల పరుశురామ్ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం పరామర్శించారు. పరుశురాం తండ్రి చిన్నవీరయ్య ఇటీవల మృతిచెందారు. గట్టుసింగారంలో పరుశురాం ఇంటికి వెళ్లిన పొంగులేటి మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొంగులేటి వెంట కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్నాయక్, క్యాంపుకార్యాలయ ఇంచార్జి తుంబూరి దయాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.