న్యూఢిల్లీ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల కషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు డీకే అరుణతో పాటు పలువురు పాల్గొన్నారు.
అసైన్డ్, దేవాదాయ భూముల కుంభకోణం కేసులో ఈటల రాజేందర్ను ప్రభుత్వం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈటల తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు.