సింగరేణి వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ
మన ఏరియాల్లో మొదటి రోజు 2594 మందికి టీకాలు
పలుచోట్ల ప్రారంభించిన డైరెక్టర్ (పీపీ) బలరాంనాయక్
శ్రీరాంపూర్, జూన్ 13 : సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కొవిడ్ వ్యాక్సిన్ ఒక సంజీవనిలా పని చేస్తుందని, తప్పకుండా వేసుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఫైనాన్స్, పీపీ) ఎన్ బలరాం నాయక్ సూచించారు. ఆదివారం సింగరేణి వ్యాప్తంగా కొవిడ్ మెగా వ్యాక్సిన్ క్యాంపులను నిర్వహించింది. శ్రీరాంపూర్లో ప్రగతీ స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో కొవిడ్ వ్యాక్సిన్ మెగా క్యాంపును డైరెక్టర్ బలరాంనాయక్ గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థను అత్యవస సర్వీసు సంస్థగా గుర్తించి కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించారని చెప్పారు. సింగరేణి సంస్థకు 30 వేల డోసులు పంపిణీ చేసిందని తెలిపారు. 10 రోజుల్లోగా సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు 100 శాతం మొదటి డోసు టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని క్యాంపులు ఏర్పాటు చేస్తున్నదని వెల్లడించారు. ఇప్పటికే సింగరేణిలో 16 వేల మంది కార్మికులకు, 14 వేల మంది కుటుంబ సభ్యులకు, రిటైర్డ్ కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన 6 కొవిడ్ వ్యాక్సిన్ మెగా క్యాంపులను జీఎం ఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పరిశీలించారు. శ్రీరాంపూర్ ఏరియాలో 1277 మందికి టీకా ఇచ్చారు. టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, కేంద్ర చర్చల ప్రతినిధి రవీందర్రెడ్డి, ఎస్వోటూజీఎం గుప్తా, ప్రాజెక్టు ఆఫీసర్లు రాజేశ్వర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, డాక్టర్లు రమేశ్బాబు, విజయలక్ష్మి, డీవైజీఎం గోవిందరాజు, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళకుమరాస్వామి, లక్షణ్, నాయకులు జగదీశ్వర్రెడ్డి, సదయ్య, గోపాల్రెడ్డి, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఆర్కేసీవోఏ క్లబ్లో..
రామకృష్ణాపూర్, జూన్ 13 : టీకాలు వేసుకున్నవారికి కరోనా సోకినా పెద్దగా తీవ్రత ఉండదని డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ ఫా) బలరాం నాయక్ అన్నారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కేపీసీవోఏ క్లబ్లో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆదివారం డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ ఫా బలరాంనాయక్ ప్రారంభించారు. మందమర్రి ఏరియా పరిధిలో 3 వేల మందికి టీకాలు వేస్తున్నామని తెలిపారు. సింగరేణిలోని 12 ఏరియాల్లో 61 సెంటర్లలో ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు 15 వేల నుంచి 20 వేల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రామకృష్ణాపూర్లో 330 మందికి టీకా ఇచ్చారు. మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం గోపాల్సింగ్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఈ అండ్ ఏజీఎం జగన్మోహన్రావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్అలీ, పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డీవై సీఎంవో ఉషారాణి, హెల్త్ ఆఫీసర్ లోకనాథ్రెడ్డి, డా. రాజారమేశ్బాబు, డా. ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యా సాగర్రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గోలేటి సీఈఆర్ క్లబ్లో
రెబ్బెన, జూన్13 : సింగరేణి లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఉద్యోగుల శ్రేయస్సు కోసమే మోగా వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేశామని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) బలరాంనాయక్ తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీఈఆర్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ క్యాంప్ను డైరెక్టర్ సందర్శించి వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఎస్వోటూజీఎం సాయిబాబు, డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, పీఎం లక్ష్మణ్రావు, పీవో చంద్రశేఖర్, డీజీఎం(సివిల్) శివరామిరెడ్డి, డీజీఎం(వర్క్షాప్) శివరామిరెడ్డి, రీజియన్ డాక్టర్ పల్లే లోకనాథ్, డీవైసీఎంవో శౌరి, డీవైపీఎం తిరుపతి, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, సెక్యురిటీ అధికారి వరప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ స్టాలిన్, రాధాకృష్ణ, సీనియర్ పీవో కిరణ్కుమార్, వేణు పాల్గొన్నారు.
188 మందికి వ్యాక్సినేషన్
గోలేటి సీఈఆర్ క్లబ్ లో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ క్యాంప్లో 188 మంది కార్మికులకు టీకాలు వేసినట్లు ఏరియా జీఎం బీ సంజీవరెడ్డి తెలిపారు.
బెల్లంపల్లి ఏరియా సింగరేణి దవాఖానలో..
బెల్లంపల్లిరూరల్, జూన్ 13: పట్టణంలోని సింగరేణి ఏరియా దవాఖానలో నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సింగరేణి డైరెక్టర్ (ఫా) ఫైనాన్స్ బలరాం నాయక్ పరిశీలించారు. అనంతరం బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డితో కలిసి బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కలిశారు. 289 మందికి టీకా వేశారు. ఏరియా దవాఖాన డీవైసీఎంవో శ్రీరాముల శౌరీ, పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్రావు, డీజీఎం (సివిల్) శివరామిరెడ్డి, డాక్టర్లు అరవింద్, రాధాకృష్ణ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కిరణ్కుమార్, ఒకటో వార్డు కౌన్సిలర్ గెల్లి రాజలింగు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, పిట్ సెక్రటరీ సత్యనారాయణ , ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెవిటి సుదర్శన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల ఆరోగ్య పరిరక్షణే సంస్థ ధ్యేయం
మందమర్రి రూరల్, జూన్ 13 : కార్మికుల ఆరోగ్య పరిరక్షణే సంస్థ ధ్యేయమని ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సీఈఆర్ క్లబ్ ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డైరెక్టర్ ఫైనాన్స్ ప్లానింగ్ అధికారి బలరాం నాయక్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. మందమర్రిలో మొత్తం 510 మంది కార్మికులకు టీకా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఈఆండ్ఎం ఏజీఎం జగన్మోహన్రావు, టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, పీఎం వరప్రసాద్, డీవై సీఎంవో డాక్టర్ మహిపాల్, యూనియన్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.