న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్ని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో తెలంగాణ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.