న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొంతమేరకు తగ్గుముఖం పట్టింది. అయినా మహారాష్ట్ర, కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో యాక్టివ్ కేస్ లోడ్ కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం.. మే 19 వరకు దేశంలోని కొవిడ్ యాక్టివ్ కేసుల్లో కర్ణాటక అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874 కాగా.. అందులో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,07,232 కు చేరింది. అయితే, యాక్టివ్ కేసుల విషయంలో 5.75 లక్షల కేసులతో కర్ణాటక టాప్ ప్లేస్లో ఉన్నది. ఇక మహారాష్ట్రలో 4.19 లక్షలు, కేరళలో 3.47 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.