సరుకుల పంపిణీలో జాప్యం చేయొద్దు

ములుగురూరల్, నవంబర్25: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు సరుకుల పంపిణీలో టీచర్లు జాప్యం చేయవద్దని, కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని డీడబ్ల్యూవో ఈపీ ప్రేమలత అన్నారు. మండలంలోని రాయినిగూడెం గ్రామంలో ఆమె బుధవారం అంగన్వాడీ టీచర్లతో సెక్టార్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే టీచర్లు, ఆయాలు సమయ పాలన పాటించాలని అన్నారు. సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలు, ప్రీస్కూల్ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. సెంటర్ల పరిధిలో బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అ న్నారు. బాలలకు, మహిళలకు ఇబ్బందులు తలెత్తితే 101, 1098టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో సీడీపీవో దేవరశెట్టి లక్ష్మి, సూపర్వైజర్ అంజమ్మ, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జ్యోతి, అవుట్ వర్కర్ రాజు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్