Mulugu
- Nov 25, 2020 , 06:50:56
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

గణపురం, నవంబరు24: మండలంలోని కర్కపల్లి గ్రామంలో మంగళవారం పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రైనీ ఐపీఎస్ అధికారి సుధీర్ రామ్ నాథ్ కేకాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెంతల మంజుల(32) రెండు నెలల క్రితం విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె చేతి వేళ్లు పూర్తిగా పని చేయడం లేదు. పనులు చేయరాకపోవడంతో మనస్తాపానికి గురై జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాలలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING