మాల్, మే18 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నాంపల్లి సీఐ సత్యం కోరారు. మంగళవారం చింతపల్లి మండలం మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వైద్యురాలు శ్రీదేవి నుంచి కరోనా బాధితుల వివరాలను సేకరించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు అత్యవసరం అనుకుంటేనే బయటికి రావాలని, అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీదేవీశ్రీనివాసులు ఉన్నారు.
నిబంధనలు పాటించాలి : సీఐ ఆదిరెడ్డి
దేవరకొండరూరల్, మే18 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని దేవరకొండ సీఐ ఆదిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మర్రిచెట్టుతండా గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలు లాక్డౌన్ సడలించిన సమయంలోనే తమకు కావాల్సిన నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవాలని, అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలన్నారు. గ్రామంలో వలంటీర్లను నియమించి మానిటర్ చేయాలని సర్పంచ్ శ్రీను నాయక్కు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నానాయక్, పంచాయతీ కార్యదర్శి సిరిచందన, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనవసరంగా బయట తిరిగితే కేసు
గుర్రంపోడు : మండలంలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో అనవసరంగా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రవికుమార్ హెచ్చరించారు. మంగళవారం పలు గ్రామాల్లో కరోనా నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉం డాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు.